న్యాల్కల్, ఏప్రిల్ 26 (స్థానికం): ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడిచినప్పుడే ఆయనకు ఘన నివాళులర్పించినట్లు అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాంతీర్డ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ విగ్రహాన్ని ఆదివారం నాడు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ చైర్మన్ తన్వీర్లతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
దళితులు విద్యావంతులు, ఆర్థికంగా ఎదిగినప్పుడే కుల వివక్ష పోతుందని, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సూచించారు.
తన తండ్రి దివంగత వెంకటస్వామి (కాకా) సూచన మేరకు 35 ఏళ్ల క్రితమే విశాఖ రేకుల ఫ్యాక్టరీ నిర్మించి నిరుపేదలకు ఉపాధి కల్పించినట్లు గుర్తుచేశారు.
అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ద్వారా 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు.
ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు కాకా అని కొనియాడారు.
అనంతరం గ్రామం నుంచి హద్నూర్ వరకు రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కోరగా, వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. విగ్రహం వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు ఎంపీ హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి చంద్రశేఖర్, గిరిధర్ రెడ్డి, తన్వీర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మహమ్మద్ యూనుస్, కండేం నర్సింలు, తిరుపతి రెడ్డి, కిరణ్ గౌడ్, నరేష్ గౌడ్, సర్పంచ్ రేవంత్ కుమార్ మరియు గ్రామస్తులు.
No comments:
Post a Comment