అత్నూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్లో చేరిక – 200 మందితో భారీగా పార్టీ ప్రవేశం
ఇండిపెండెంట్ సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్ కాంగ్రెస్ పార్టీలో చేరిక – నాయకుల సమక్షంలో కార్యక్రమం
అత్నూర్, న్యాల్కల్ మండలం: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ శెట్కార్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, డీసీసీ సభ్యుడు భాస్కర్ రెడ్డి సమక్షంలో ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అత్నూర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షుడు రఫీయొద్దీన్ పటేల్, గ్రామ యూత్ ప్రెసిడెంట్ కలీమ్ పటేల్, ఇస్మాయిల్ సాబ్, రహీమ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్తో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన వారిని నాయకులు అభినందించి, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
కార్యక్రమంలో రసూల్ పటేల్, ఎజాస్ పటేల్, జమీర్ పటేల్, సతీష్ పటేల్, అశోక్ పటేల్, మహమ్మద్ ముస్తఫ్ఫా సాబ్, అబ్దుల్ రహిమాన్, మాజీద్, శివాజీ గౌడ్, వీర రెడ్డి, వాజీద్ పటేల్, జహంగీర్ సాబ్, వెంకట్ రెడ్డి, ఖయ్యుమ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
📍 Nyalkal Mandal | Sangareddy District
✍️ Reporter: Sangameshwar Reddy

No comments:
Post a Comment